జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశ్యము

జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశ్యము:-
-‐--------------‐------------------------------------------
కరోనా వైరస్  బహిరంగ ప్రదేశాలలో  12 గంటల వరకు జీవించి ఉంటుంది .ఈ 12 గంటల్లో బహిరంగ ప్రదేశాలకు   ఎవరు వెళ్ళకుండా ఉండగలిగితే ఈ వైరస్ మరణిస్తుంది . బహిరంగ ప్రదేశాలకు మనం వెళ్లడం , పరిసర ప్రాంతాలలో మనం సంచరించుట, అక్కడ ఉన్న వస్తువులను ముట్టుకోవడం, వలన  ఈ వైరస్ గణనీయంగా వృద్ధి చెందుతుంది  12 గంటలపాటు  దేశ ప్రజలంతా  ఇంటి లోపలే ఉండగలిగితే  చైన్ ప్రక్రియను అనుసరించి  వ్యాప్తి చెందే ఈ వైరస్ మరణిస్తుంది.  తద్వారా  ఈ వ్యాధిని  మనదేశంలో  వ్యాప్తి చెందకుండా  నివారించవచ్చు  .


ప్రపంచ దేశాలు  బహిరంగ ప్రదేశాలలో  Sanitizers వెదజల్లడం  వాటితో  పరిసరాలను శుభ్రం చేయడం  మనం చూస్తూనే ఉన్నాము . ఈ ప్రక్రియ  కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుందని మనకు తెలిసిన విషయమే. వివిధ రకాలైన  మందులు బహిరంగ ప్రదేశాలలో  పిచికారీ చేయడంతోపాటు  12 గంటలపాటు  మనం బహిరంగ ప్రదేశాలకు  వెళ్లకుండా ఉండగలిగితే  వైరస్ తనంతట తానే మరణిస్తుంది.  ఈ ఒక్క విషయం మనం చేయగలిగితే  100% వైరస్ ను నియంత్రించగలము .
 కాబట్టి దేశ ప్రజలందరూ ఆదివారం అనగా మార్చి 22వ తారీకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు  ఇంటి వద్దనే ఉండండి.   తప్పని పరిస్థితులలో  ఉదయం 7 గంటల లోపు,సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత  ప్లాన్ చేసుకోండి.
 
అందరూ సహకరిస్తే ఈ వైరస్ నుండి మనం, మన పిల్లలు, మన పెద్దలను, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోగలం.


  జనతా కర్ఫ్యూ :-  ఆదివారం  (22nd March) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకూ  అనగా  14 గంటలు  ఇంటి నుండి బయటకు రాకుండా  సహకరిద్దాం  ఇది మన భవిష్యత్తు కోసమే .