దేశం మొత్తం సంపూర్ణ మూసివేత: మోదీ
న్యూఢిల్లీ: ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు.
[*ఢిల్లీ*
*ప్రధాని మోడీ కామెంట్స్...*
*ఈ రోజు అర్ధరాత్రి నుండి భారత్ దేశం మొత్తం లాక్ డౌన్*
ఇది ఒక విధమైన కర్ఫ్యూ లాంటిదే
*జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇది*
ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం
ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందే
*వచ్చే 21 రోజుల పాటు ఈ నిర్బంధం అమలులో ఉంటుంది*
కరోనా మహమ్మరిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదు.
*లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది*
మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖ గీయండి.