రెడ్ జోన్ ప్రాంతల్లో వాలంటరీలు సమర్ధ వంతంగా విదులు నిర్వహించాలి ....

రెడ్ జోన్ ప్రాంతల్లో వాలంటరీలు సమర్ధ వంతంగా విదులు నిర్వహించాలి ....  


(సిటీ ట్రెండ్ న్యూస్: reporter:B.SANTOSH KUMAR)



 కోవిడ్ 19 నేపథ్యంలో రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతల్లో వాలంటరీలు సమర్ధ వంతంగా విధులు నిర్వహించాలని పశ్చిమ జోన్ ఏసిపి జి.స్వరూపరాణి పెర్కొన్నారు . ఈమేరకు ఐ .టి.ఐ కూడలి బిఆర్టీఎస్ రహదారి వద్ద శుక్రవారం  సాయంత్రం జీవీఎంసీ జోన్ - 4 కమిషనర్ పి.సింహచలం ,తహశీల్ధార్ బి.వి.రాణి   సహయక పౌర సరపర శాఖ అదికారి మూర్తి సమక్షంలో గ్రామ సచివాలయం కార్యదర్శులు , వాలంటరీ లతో సమీక్ష  సమవేశం నిర్వహించారు . ఈసందర్బంగా జోన్ ఏసిపి జి.స్వరూపరాణి మాట్లడుతూ విధినిర్వహణాలలో తమపై ఎవరైన దురుసుగా ప్రవర్తిస్తే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఇప్పటికే పలు ప్రాంతల్లో సచివాలయ సిబ్బందిపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసారు . సమవేశంలో పాల్గున్న జీవీఎంసీ జోన్ - 4 కమిషనర్ పి.సింహచలం  మాట్లడుతూ ఇప్పటికే కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ప్రాంతాలను రెడ్ జోన్ లుగా గుర్తించామని ఆయా జోన్ల పరిథిలో ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రాకుండ    వాలంటరీలు ప్రతి ఇంటికి నిత్యవసర వస్తువులు చేరవేసే విదంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు . 
తహశీల్ధార్ బి.వి.రాణి  మాట్లడుతూ కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో సమస్యత్మక ప్రాంతల్లో విదులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తూ విదులు నిర్వహించాలని సూచించారు .  



సహయక పౌర సరపర శాఖ అదికారి మూర్తి మాట్లడుతూ ఈనెల 16 వ తేది నుండి రెండవ విడత రేషన్ ను రెడ్ జోన్ ప్రాంతల్లో వాలంటరీల ద్వార పంపిణీ చేయడం జరుగుతుందని అందులోబాగంగ ఈసారి అందించే రేషన్ లో బియ్యం తో పాటుగా చనగా పప్పు లబ్ది దారులకు అందించడం జరుగుతోందన్నారు . కార్యక్రమంలో కంచరపాలెం సి.ఐ కృష్ణరావు , ఎస్ .ఐ అప్పల నాయుడు , విజయ్ , లొకేశ్వరావు , మహేశ్వరావు , జీవీఎంసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో సచివాలయం సిబ్బంది పాల్గున్నారు ...