తేదీ.20.04.2020 KOVID-19 లాక్ డౌన్ కారణంగా
పాడేరు లో నిరాశ్రయులైన సాదువులు, బిచ్చగాళ్ల కు మరియు పాడేరు లో రవాణా సౌకర్యం లేని గిరిజనులకు మరియు పాడేరు ప్రభుత్వ అసుపత్రి లోఉన్న ఔట్ పేషేంట్లకు భోజనం ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది. సోమేలి సింహాచలం పీడీ తలారిసింగి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం మధ్యాన్నం, రాత్రి భోజనము సరఫరా చేయడం జరుగుతుంది. పాడేరు DSP నేతృత్వంలో ప్రాజెక్టు అధికారి, ITDA పాడేరువారు DD(tw)విజయకుమార్ వారి సౌజన్యం తో ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రీన్ టీమ్ మరియు మణికంఠ అన్నదాన ట్రస్టు వారి సహాయ సహాకారాలతోఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది.తలరిసింగి ఉన్నతపాఠశాల హెచ్.ఎమ్ అప్పలనాయుడు,పి.డి సింహాచలం, వార్డెన్ కొండబాబు, అంజనేయ మాస్టారు
మరియు గ్రీన్ టీమ్సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు