విశాఖ ఏజెన్సీ లో చనిపోయిన వాలంటీర్‌ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం

 


(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )


విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది.


పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన వాలంటీర్‌ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వాలంటీర్ చనిపోయినట్లు వార్తను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూశారు. వెంటనే స్పందించి వాలంటీర్ అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు.







ముఖ్యమంత్రి    వైఎస్ జగన్    సీఎంవో అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వంటి విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అనురాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు. ఇటు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు..

ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే తక్షణ సాయంగా రూ.10వేలు వాంటీర్ కుటుంబానికి అందజేశారు.