చిత్తూరు..నా బైక్ కే అడ్డుపడుతావా...పామును నోటితో చీల్చి చెండాడిన తాగుబోతు..
మద్యం మత్తులో ఏం చేస్థున్నాడో తెలిసే లోపే పామును నోటి తో చీల్చి చెండాడిన వ్యక్తి
పాము మనిషిని కాటేయడం మామూలే..కానీ మనిషే పామును కాటేస్తే..అదే కాలకూట విషం కక్కే విష నాగును కరుస్తే.. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా.... కర్ణాటక బోర్డర్ లో చోటు చేసుకుంది. తన బైక్ కు అడ్డాగా వచ్చిందన్న కోపం తో ఓ మందు బాబు ఆ పామును అందరి ముందే కొరికి, నమిలి చంపి మెడలో దండలా ముడి వేసుకుని వెళ్లాడు. దీన్ని చూసిన స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. లిక్కర్ కిక్కు తలకెక్కితే వెయ్యిఏనుగుల బలం వస్తుందంటారు. ఎంత పిరికోడికైనా కొండను ఢీకొట్టే థైర్యం వస్తుందంటారు. ఈ మాటలన్నీ నిజమో..అబద్థమో కానీ ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు. దాన్ని కసితీరా నోటితో కొరికి కొరికి చంపేశాడు. చిత్తూరుజిల్లా కర్ణాటక బార్డర్ ములబాగుల తాలూకా ముసునూరు లో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. 40 రోజుల లాక్ డౌన్ విరామం తరువాత కుమార్ అనే యువకుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడ చేరుకుని ఫుల్లుగా మందుకొట్టి అనంతరం తన బైక్ పై బయలుదేరాడు. అయితే హఠాత్తుగా ఐదు అడుగుల నాగుపాము అతని మోటారు సైకిల్ కు అడ్డంగా వచ్చింది.అంతే అమందు బాబుకు పాము పై కోపం వచ్చేసింది.